Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రి నుంచి అన్నవరం సత్యదేవునికి ఘనంగా పట్టువస్త్రాల సమర్పణ

ఇంద్రకీలాద్రి నుంచి అన్నవరం సత్యదేవునికి పట్టువస్త్రాల సమర్పణ, కళ్యాణోత్సవం సందర్భంగా భక్తిశ్రద్ధలతో, అధికారుల సమక్షంలో వైభవంగా నిర్వహణ

Devotional/Cultural

అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని, విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధి నుండి పట్టువస్త్రాలను ఆదివారం సాయంత్రం ఘనంగా సమర్పించారు.

 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికార బృందం రత్నగిరి క్షేత్రానికి చేరుకుంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దంపతులు, కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ దంపతులు, అర్చకులు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పట్టువస్త్రాలతో అన్నవరం చేరుకోగా, రత్నగిరి దేవస్థాన అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు.

 మంగళవాయిద్యాల నడుమ శ్రీ కనకదుర్గ అమ్మవారి తరపున పట్టువస్త్రాలు, పూజా సామాగ్రిని స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అనంతరం స్వామివారి దర్శనం అనంతరం, అన్నవరం దేవస్థానం ఈవో చక్రధరరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఇంద్రకీలాద్రి బృందానికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇరు దేవస్థానాల అధికారులు ఆధ్యాత్మిక విశేషాలను పరస్పరం పంచుకున్నారు.

కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి. రాఘవరాజు, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి, సిబ్బంది ఎం. జయప్రకాష్ (జెపి), కె. లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవ వేళ ఇంద్రకీలాద్రి అమ్మవారి పట్టువస్త్రాల సమర్పణ, ఈ రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరోసారి స్పష్టంగా ప్రతిబింబించింది.

 

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.