Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఇంద్రకీలాద్రి నుంచి అన్నవరం సత్యదేవునికి ఘనంగా పట్టువస్త్రాల సమర్పణ

ఇంద్రకీలాద్రి నుంచి అన్నవరం సత్యదేవునికి పట్టువస్త్రాల సమర్పణ, కళ్యాణోత్సవం సందర్భంగా భక్తిశ్రద్ధలతో, అధికారుల సమక్షంలో వైభవంగా నిర్వహణ

Devotional/Cultural

అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని, విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధి నుండి పట్టువస్త్రాలను ఆదివారం సాయంత్రం ఘనంగా సమర్పించారు.

 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికార బృందం రత్నగిరి క్షేత్రానికి చేరుకుంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దంపతులు, కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ దంపతులు, అర్చకులు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పట్టువస్త్రాలతో అన్నవరం చేరుకోగా, రత్నగిరి దేవస్థాన అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు.

 మంగళవాయిద్యాల నడుమ శ్రీ కనకదుర్గ అమ్మవారి తరపున పట్టువస్త్రాలు, పూజా సామాగ్రిని స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అనంతరం స్వామివారి దర్శనం అనంతరం, అన్నవరం దేవస్థానం ఈవో చక్రధరరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఇంద్రకీలాద్రి బృందానికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇరు దేవస్థానాల అధికారులు ఆధ్యాత్మిక విశేషాలను పరస్పరం పంచుకున్నారు.

కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి. రాఘవరాజు, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి, సిబ్బంది ఎం. జయప్రకాష్ (జెపి), కె. లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవ వేళ ఇంద్రకీలాద్రి అమ్మవారి పట్టువస్త్రాల సమర్పణ, ఈ రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరోసారి స్పష్టంగా ప్రతిబింబించింది.

 

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.