Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

శ్రీశైలంలో సత్రాల నిర్వాహకులతో ఈవో సమావేశం

శ్రీశైలంలో సత్రాల నిర్వాహకులతో ఈవో సమావేశమై, భక్తులకు మెరుగైన సేవలు, శుచీశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని సూచించారు. వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు

Devotional/Cultural

శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు.

ఈ మేరకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తున్నామని చెప్పారు. క్షేత్రాభివృద్ధికి స్థానిక సత్రాల నిర్వాహకులు సహకరించాలని ఆయన కోరారు.

శనివారం పరిపాలనా భవనంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక సత్రాల నిర్వాహకులతో ఈవో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా భక్తులకు సేవాభావంతో మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా సత్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి, భక్తులకు ఉచితంగా మంచినీరు, మజ్జిగ అందించాలన్నారు. సత్ర ప్రాంగణాల్లో శుచీశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అన్నదాన కార్యక్రమాల్లో కూడా పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సూచించారు. తాజా కూరగాయల వినియోగం, సిబ్బందికి అవగాహన కల్పించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా ప్రకటించామని, ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడంలో సత్రాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. చెత్త నిర్వహణలో తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి అందించాలన్నారు.

అదేవిధంగా సత్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నామస్మరణ ప్రసారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవదాయ చట్టం ప్రకారం నిషేధిత కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ప్రజాసంబంధాల విభాగాల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.