Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఆధ్యాత్మికం, ఆహ్లాదం, అభివృద్ధి సమ్మేళనంగా ఇంద్రకీలాద్రి తీర్చిదిద్దే దిశగా అడుగులు

ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మికం, పచ్చదనం, అభివృద్ధి కలిసిన పర్యావరణ హిత క్షేత్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.

Devotional/Cultural

ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికత, ఆహ్లాదం, అభివృద్ధి కలిసిన అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ (ADC) చైర్‌పర్సన్ లక్ష్మి పార్ధసారధి భాస్కర్ ఆదేశాలతో ప్రత్యేక నిపుణుల బృందం గురువారం ఇంద్రకీలాద్రిని సందర్శించింది.

 హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ‘కన్హ శాంతివనం’ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నిపుణులు డాక్టర్ రమాకాంత్, శరవణన్, శరత్ లతో పాటు అమరావతి అభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్ ఈ బృందంలో ఉన్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మానసిక ప్రశాంతతను అందించేలా కొండపై పచ్చదనాన్ని పెంపొందించడంపై ఈ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయ ఈవో శీనా నాయక్ తో కలిసి నిపుణుల బృందం పలు ప్రాంతాల్లో పచ్చదనం పెంపుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించింది.

 ఇందులో శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయ పరిసరాలు, కనకదుర్గ నగర్ నుంచి మహా మండపం వరకు ఉన్న మార్గం, ఘాట్ రోడ్ రిటైనింగ్ వాల్ నుంచి ప్రధాన ఆలయం వరకు ప్రాంతం, అలాగే ఘాట్ రోడ్ దిగువ ప్రాంతం మరియు మౌనస్వామి ఆలయం వెనుక భాగం ఉన్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను ఆలయ ఈవో శీనా నాయక్ నిపుణుల బృందానికి వివరించారు.

ఈ ప్రణాళికలో భాగంగా ఇంద్రకీలాద్రిని పర్యావరణ హిత ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు నిపుణుల బృందం తమ సూచనలను అందించనుంది. అత్యున్నత ప్రమాణాలతో ఇంద్రకీలాద్రి రూపురేఖలను మార్చి, భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే లక్ష్యమని బృంద సభ్యులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు, ప్రతిపాదనలు సిద్ధం చేసి, దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సంయుక్తంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.