Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్

తలంపులమ్మ ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్, క్యూయాస్క్ ప్రారంభించి పర్యావరణ పరిరక్షణపై సూచనలు చేశారు.

Devotional/Cultural

లోవ గ్రామంలో వెలసిన శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీ సగిలి షణ్మోహన్ సందర్శించారు.

 ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆలయంలో నిర్మాణంలో ఉన్న నూతన ఘాట్ రోడ్డు పనులు, ఘాట్ రోడ్ దిగువ నుంచి రోడ్డు విస్తరణ పనులు, అలాగే ఇప్పటికే పూర్తైన రాజగోపురం మరియు మహా మండపం నిర్మాణ పనుల పురోగతిపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి కలెక్టర్‌కు వివరించారు. జరిగిన మరియు కొనసాగుతున్న అభివృద్ధి పనుల వ్యయ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను కూడా ఆయనకు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్‌కు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు, అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం కలెక్టర్‌కు అమ్మవారి శేషవస్త్రం, జ్ఞాపిక అందజేయగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయంలో దర్శనాలు, ప్రసాదాలు, వసతి తదితర సేవలను సులభంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవలు, మన మిత్ర, ఏపీ టెంపుల్స్ యాప్ వంటి సాంకేతిక సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా కరూర్ వైశ్యా బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యూయాస్క్ మిషన్లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. భక్తులు ప్రభుత్వం అభివృద్ధి చేసిన సాంకేతిక వసతులను వినియోగించుకుని ఆలయ సేవలను మరింత సులభంగా పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ, ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ కవర్లు, కాగితం, నారా ఉత్పత్తులు వంటి పర్యావరణ హిత వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై భక్తుల్లో మరింత అవగాహన కల్పించి, ఆచరణలోకి తీసుకురావాలని దేవస్థానం అధికారులకు ఆదేశించారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు జిల్లా కలెక్టర్ కార్యనిర్వహణాధికారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ ఇంజనీర్, తుని మండల తహసీల్దార్, పంచాయతీరాజ్ శాఖ డి.డి.ఇ., రెవెన్యూ సిబ్బంది, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.