Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్

తలంపులమ్మ ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్, క్యూయాస్క్ ప్రారంభించి పర్యావరణ పరిరక్షణపై సూచనలు చేశారు.

Devotional/Cultural

లోవ గ్రామంలో వెలసిన శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీ సగిలి షణ్మోహన్ సందర్శించారు.

 ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆలయంలో నిర్మాణంలో ఉన్న నూతన ఘాట్ రోడ్డు పనులు, ఘాట్ రోడ్ దిగువ నుంచి రోడ్డు విస్తరణ పనులు, అలాగే ఇప్పటికే పూర్తైన రాజగోపురం మరియు మహా మండపం నిర్మాణ పనుల పురోగతిపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి కలెక్టర్‌కు వివరించారు. జరిగిన మరియు కొనసాగుతున్న అభివృద్ధి పనుల వ్యయ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను కూడా ఆయనకు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్‌కు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు, అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం కలెక్టర్‌కు అమ్మవారి శేషవస్త్రం, జ్ఞాపిక అందజేయగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయంలో దర్శనాలు, ప్రసాదాలు, వసతి తదితర సేవలను సులభంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవలు, మన మిత్ర, ఏపీ టెంపుల్స్ యాప్ వంటి సాంకేతిక సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా కరూర్ వైశ్యా బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యూయాస్క్ మిషన్లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. భక్తులు ప్రభుత్వం అభివృద్ధి చేసిన సాంకేతిక వసతులను వినియోగించుకుని ఆలయ సేవలను మరింత సులభంగా పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ, ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ కవర్లు, కాగితం, నారా ఉత్పత్తులు వంటి పర్యావరణ హిత వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై భక్తుల్లో మరింత అవగాహన కల్పించి, ఆచరణలోకి తీసుకురావాలని దేవస్థానం అధికారులకు ఆదేశించారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు జిల్లా కలెక్టర్ కార్యనిర్వహణాధికారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ ఇంజనీర్, తుని మండల తహసీల్దార్, పంచాయతీరాజ్ శాఖ డి.డి.ఇ., రెవెన్యూ సిబ్బంది, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.