Latest
ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.

కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?

కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై పెరుగుతున్న ప్రశ్నలు.. నిర్మాణ నాణ్యత, సాంకేతిక లోపాలు, లీకేజీలపై నిపుణుల స్పష్టత అవసరం. ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టుకు భద్రతే కీలకం.

Telangana/karnataka

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు మరోసారి తీవ్ర చర్చకు కేంద్రంగా మారింది. వేల కోట్ల రూపాయలు కాదు.. లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించిన ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత, ఇంజినీరింగ్ ప్రమాణాలు, భద్రతపై వస్తున్న ప్రశ్నలకు ఇక రాజకీయ సమాధానాలు కాదు.. సాంకేతిక సమాధానాలు కావాలి!

 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ నీటి అవసరాలకు కీలక పరిష్కారంగా ప్రభుత్వం భారీ స్థాయిలో ముందుకు తీసుకెళ్లింది. కానీ కాలక్రమంలో ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలపై తలెత్తిన సాంకేతిక సమస్యలు, నష్టం, లీకేజీలు, నిర్వహణ అంశాలు ప్రాజెక్టు భద్రతపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి.

చెరువుకు బుంగ పడితేనే ప్రమాదం.. మరి కాళేశ్వరం సంగతేంటి?

మన గ్రామాల్లో, పట్టణాల్లో చిన్న చెరువులకు కూడా బుంగ పడినా, లీకేజీ వచ్చినా ప్రజలు ఆందోళన చెందుతారు. ఒక్కసారిగా నీరు విడుదలైతే దిగువ ప్రాంతాల్లో పంటలు, ఆస్తులు, చివరకు ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే పరిస్థితులు మనం ఎన్నోసార్లు చూశాం.

అలాంటిది భారీ స్థాయిలో నిర్మించిన కాళేశ్వరం వంటి ప్రాజెక్టులో కీలక నిర్మాణాలకు సమస్య వస్తే దాని ప్రభావం ఎంత దూరం వెళ్తుంది? అత్యవసర పరిస్థితుల్లో దిగువ ప్రాంతాల ప్రజల భద్రతకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి? ఇవే ఇప్పుడు సామాన్య ప్రజల్లో తలెత్తుతున్న కీలక ప్రశ్నలు.

రాజకీయాలు పక్కనపెట్టి.. సేఫ్టీపై సమాధానం చెప్పాలి!

కాళేశ్వరం విషయంలో ఎవరు తప్పు చేశారు? ఎవరి నిర్లక్ష్యం వల్ల సమస్యలు వచ్చాయి? నిర్మాణ సమయంలో అన్ని డిజైన్‌, మెటీరియల్‌, క్వాలిటీ కంట్రోల్‌, భద్రతా ప్రమాణాలు పాటించారా? నిర్వహణలో ఎక్కడైనా లోపాలున్నాయా?

ఈ ప్రశ్నలకు అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పర ఆరోపణలు చేసుకోవడం సరిపోదు

స్వతంత్ర నిపుణుల సాంకేతిక పరిశీలన.. సమగ్ర భద్రతా ఆడిట్‌.. ప్రజలకు అందుబాటులో ఉండే నివేదిక.. ఇదే ఇప్పుడు అవసరం.

ప్రాజెక్టులో ఏదైనా లోపం ఉంటే దాన్ని దాచడం కాదు.. శాశ్వత పరిష్కారం చూపాలి. బాధ్యత ఎవరిపైన ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో పునరావృతం కాకుండా పటిష్ఠమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలి..

కాళేశ్వరం ఎవరిది?

కాళేశ్వరం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన ఆస్తి కాదు. ఇది తెలంగాణ ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రజా ప్రాజెక్టు.

అందుకే అసలు ప్రశ్న “కాళేశ్వరం ఎవరి ప్రాజెక్టు?” కాదు.

“కాళేశ్వరం ఎంత సురక్షితం?” అనేదే అసలు ప్రశ్న. ప్రజాధనంతో నిర్మించిన ఇంత భారీ ప్రాజెక్టు విషయంలో భద్రతపై ఒక్క శాతం అనుమానం ఉన్నా దానిని శాస్త్రీయంగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

కాళేశ్వరం రాజకీయ యుద్ధభూమిగా కాకుండా.. ప్రజల భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశంగా చూడాల్సిన సమయం వచ్చింది. ప్రజలకు నిజం కావాలి. సాంకేతిక ఆధారాలతో సమాధానం కావాలి. బాధ్యత ఎవరిదో తేలాలి.

Related Stories

Latest Articles

  1. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  2. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  3. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  4. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  5. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  6. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  7. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  8. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
  9. Telangana....సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
  10. అమెరికా ఎయిర్ ఫోర్స్ C-17 మాస్కోలో ల్యాండ్, అమెరికా-రష్యా ఉద్రిక్తతల మధ్య రహస్యాన్ని కలిగిస్తుంది
Comments

Sign in with Google to comment.