Latest
ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?

తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల టికెట్ వివాదం మంటలు రేపుతోంది. కొండా సుస్మిత వ్యాఖ్యలతో రేవంత్ వర్గం అప్రమత్తమైందా? 18 మంది ఎమ్మెల్యేల భేటీతో రాజకీయ వేడి పెరిగింది.

Telangana/karnataka

హైదరాబాద్ | ఆగస్టు 21, 2026

 తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారుతున్నాయా? రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే కొనసాగుతున్న వర్గపోరుకు పరకాల వివాదం మరింత ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలపై పోరాడాల్సిన నేతలు.. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసుకోవడం కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.

పరకాల సీటుతో మొదలైన మంట!

పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించి, ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికే వచ్చే ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో వివాదం మరింత ముదిరింది. ఈ ప్రకటనపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. పరకాలపై తమ ఆధిపత్యాన్ని ప్రస్తావిస్తూ, రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్ ఇస్తే సహించబోమన్న తరహాలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి.

“మేమే రేవంత్‌ను హైకమాండ్‌కు పరిచయం చేశాం”.. సుస్మిత వ్యాఖ్యలతో దుమారం

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సుస్మిత చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. తామే రేవంత్‌రెడ్డిని హైకమాండ్‌కు పరిచయం చేశామని, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో అహంకారం పెరిగిందని ఆమె ఆరోపించినట్టు సమాచారం. పార్టీ అంతర్గత వ్యవహారాలు, టికెట్ కేటాయింపులపై ఈ స్థాయిలో బహిరంగ వ్యాఖ్యలు రావడం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కూడా ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సుస్మిత మాట్లాడితే.. మంత్రి కొండా సురేఖకు నోటీసు ఎందుకు?

 ఈ వివాదంపై అధిష్ఠానం మంత్రి కొండా సురేఖకు నోటీసు జారీ చేసినట్టు సమాచారం. అయితే వ్యాఖ్యలు చేసింది తాను కాదని, తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనకు నోటీసు ఎందుకంటూ మంత్రి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇదే అంశం ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందనే చర్చ మొదలైంది.18 మంది ఎమ్మెల్యేల భేటీ.. రేవంత్ వర్గం అలర్ట్! తాజా పరిణామాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్గం అప్రమత్తమైనట్టు సమాచారం

. శుక్రవారం సుమారు 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సమా వేషం పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమావేశానికి మరింత మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించినప్పటికీ, పరిమిత సంఖ్యలోనే నేతలు హాజరైనట్టు సమాచారం. సుస్మిత వ్యాఖ్యల వెనుక మరేదైనా రాజకీయ శక్తి ఉందా? అనే అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు, బహిరంగ విభేదాలు వెంటనే కట్టడి చేయకపోతే పార్టీకి నష్టం తప్పదని, పరిస్థితి చివరకు ప్రభుత్వ స్థిరత్వంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి కొందరు నేతలు తీసుకెళ్లినట్టు సమాచారం.

అమెరికా టూర్ రద్దు.. అసలు కారణం ఇదేనా?

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లకుండా ఈ నెల 23న హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న నేపథ్యంలో కూడా రాజకీయ చర్చ మొదలైంది. కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతోనే అమెరికా పర్యటనకు వెళ్లలేకపోతున్నట్టు ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ.. పార్టీ అంతర్గత పరిణామాలు కూడా ఆయన నిర్ణయంపై ప్రభావం చూపాయా? అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

చిన్నారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో మరింత వేడి

 ఇదిలా ఉంటే వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితర నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పటికే టికెట్లు, నియోజకవర్గాల ఆధిపత్యం, నేతల మధ్య విభేదాలతో కాంగ్రెస్‌లో వర్గపోరు కొనసాగుతుండగా.. పరకాల వివాదం ఆ మంటలకు మరింత ఆజ్యం పోసినట్టైంది.

ప్రత్యర్థులపై రాజకీయ పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ నేతలే ఒకరిపై ఒకరు బహిరంగంగా దాడి చేసుకుంటే.. ఈ అంతర్గత యుద్ధం చివరకు ఎటు దారితీస్తుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Stories

Latest Articles

  1. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  2. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  3. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  4. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  5. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  6. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  7. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  8. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  9. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
  10. Telangana....సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Comments

Sign in with Google to comment.