Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

సచివాలయం సామాన్యులకు దూరమా..? సిఫారసు ఉంటేనే దర్శనమా..?

తెలంగాణ సచివాలయంలో సాధారణ ప్రజలకు ప్రవేశం దొరకడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. గంటల తరబడి వేచి చూసినా మంత్రులను కలిసే అవకాశం లేకపోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad News

హైదరాబాద్: తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కార కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర సచివాలయం ఇప్పుడు సామాన్య ప్రజలకు అందని కోటగా మారిందా అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. తమ సమస్యలను నేరుగా మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు చేరుకునే ప్రజలకు సచివాలయం గడప దాటడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తమవుతోంది.

 గంటల తరబడి సచివాలయం వెలుపల వేచి చూసినా మంత్రులను కలిసే అవకాశం దక్కడం లేదని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారికి అనుమతులు నిరాకరించబడుతుండగా, సన్మానాలు, మర్యాదపూర్వక భేటీలు, సిఫారసులతో వచ్చే వారికి మాత్రం తలుపులు సులభంగా తెరుచుకుంటున్నాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా కీలక మంత్రులను కలవాలంటే ముందస్తు అపాయింట్‌మెంట్, రాజకీయ పరిచయాలు లేదా బలమైన సిఫారసు తప్పనిసరిగా మారిపోయిందనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. ప్రజల కోసం నడవాల్సిన పాలనా వ్యవస్థలో సామాన్యుడి స్వరం వినిపించకపోతే, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

గత ప్రభుత్వంపై "ప్రజలకు దూరమైంది" అంటూ తీవ్ర విమర్శలు చేసిన ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిఫారసు ఉన్నవారికే సచివాలయం తలుపులు తెరుచుకుంటే, సాధారణ ప్రజల సమస్యలను వినేది ఎవరు? ప్రజా ప్రభుత్వంలో ప్రజలకే ప్రవేశం లేకపోతే అది ఎవరి ప్రభుత్వం అన్న ప్రశ్నలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి.

ప్రజల కష్టాలు వినేందుకు ఏర్పడిన వ్యవస్థలో ప్రజలకే ప్రవేశం లేకపోవడం, సమస్యలు చెప్పుకునే అవకాశమే లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. తెలంగాణ సచివాలయం నిజంగా ప్రజల సచివాలయమేనా? లేక సిఫారసులు, పరిచయాలు ఉన్నవారికే పరిమితమైన అధికార కేంద్రంగా మారుతోందా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.