Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

చెంచుగూడెములలో మా స్వామి మల్లన్న మా చెంతకే కార్యక్రమం ప్రారంభం

మేకలబండ చెంచుగూడెంలో ‘మా స్వామి మల్లన్న’ కార్యక్రమం శోభాయాత్ర, కల్యాణోత్సవంతో ఘనంగా నిర్వహించారు.

Devotional/Cultural

హిందూ ధర్మప్రచారంలో భాగంగా చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మేకలబండ చెంచుగూడెంలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

 ఈ కార్యక్రమానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్. నాయుడు, ఏపిడీ కె.పి. నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు గుల్ల గంగమ్మ, కోడె కాంతివర్థిని తదితరులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఐటీడీఏ సిబ్బంది హాజరయ్యారు. ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ బయలువీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 అనంతరం ఆలయం నుంచి మేకలబండలో ఏర్పాటు చేసిన కల్యాణవేదిక వరకు ధర్మప్రచార రథంతో శోభాయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా చెంచు భక్తులు గ్రామ ప్రధాన వీధిని రంగవల్లులతో అలంకరించి శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. శోభాయాత్ర అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

కార్యక్రమం సంకల్ప పఠనంతో ప్రారంభమై, మహాగణపతి పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, గౌరీపూజ, వరపూజ తదితర వైదిక కర్మలు నిర్వహించబడ్డాయి. అనంతరం మంగళాష్టకాల మధ్య సుముహూర్తంలో జీలకర్ర-బెల్లం సమర్పణ, మాంగల్యధారణ, తలంబ్రాలు వంటి ముఖ్య ఘట్టాలు నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో పునఃపూజలు, ఆశీర్వచనాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెంచు భక్తులకు శేషవస్త్రాలు (పురుషులకు పంచా-కండువా, మహిళలకు చీర-రవిక) అందజేశారు. ఇదే కార్యక్రమం భాగంగా మే 7న మార్కాపురం జిల్లా చింతలలో కూడా ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.