Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఇంద్రకీలాద్రిపై చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు.. రావణ వాహనంపై ఊరేగిన శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరులు

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రావణ వాహన సేవ ఘనంగా నిర్వహించారు.

Devotional/Cultural

ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి పండితులు మూల మంత్ర హవనాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిపూర్వకంగా జరిగాయి.

రావణ వాహనంపై మల్లేశ్వర స్వామి విహారం చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు మల్లేశ్వర మహామండపం నుంచి శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరుల రావణ వాహన సేవ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పురాణాల ప్రకారం రావణుడు లంకాధిపతి, పౌలస్త్య బ్రహ్మ వంశస్థుడు, అలాగే పరమశివుని మహాభక్తుడు. శివుని అంశతో జన్మించిన రావణుడు ప్రతిరోజూ శివారాధన, అభిషేకాలు నిర్వహించిన తర్వాతే ఆహారం స్వీకరించేవాడని పురాణోక్తి. అంతటి శివభక్తుడైన రావణుడు, పరమశివుడిని కైలాసం నుంచి లంకకు తీసుకురావాలని సంకల్పించి, కఠోర తపస్సు చేశాడని, శివతాండవ స్తోత్రంతో శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని ఆధ్యాత్మిక విశ్వాసం.

సంప్రదాయ కళారూపాలతో వాహన సేవకు భక్తిరస వాతావరణం ప్రఖ్యాతిగాంచిన రావణ వాహనంపై స్వామివారు, అమ్మవార్లు కొలువై ఉండగా, తప్పెట్లు, కోలాట నృత్యాలు, తాళం భజన వంటి సంప్రదాయ కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ శ్రేణి మహా మండపం నుంచి ప్రారంభమై, కనకదుర్గ నగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మెయిన్ బజార్ మార్గాల మీదుగా కొనసాగింది

 

పాల్గొన్న ఆలయ అధికారులు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వీకే శీనా నాయక్ కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు వి. శివ ప్రసాద్ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పి. రాఘవరాజు, ఎ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.