Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఏపీ దేవాదాయ శాఖలో 342 ధార్మిక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం – వేదపారాయణదారుల మౌఖిక పరీక్షలు షురూ

ఏపీ దేవాదాయ శాఖలో 342 ధార్మిక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. 5 వేల మందికి పైగా అభ్యర్థులకు వేదపారాయణదారుల మౌఖిక పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.

AP/SOUTH

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వేదపారాయణదారులు, అర్చకులు, పరిచారకులు, భజంత్రీలు, వంట స్వాములు తదితర 342 ధార్మిక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించడం, పరిశీలన పూర్తి చేసి హాల్ టికెట్లు జారీ చేసిన అనంతరం తొలి దశగా వేదపారాయణదారుల మౌఖిక పరీక్షలను ప్రారంభించినట్లు వెల్లడించారు.

 

విజయవాడలోని మాడపాటి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక సిబ్బంది పోస్టులను పూర్తిగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సెంట్రలైజ్డ్ పరీక్షా విధానాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 342 పోస్టులకు 5 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న మల్టీ జోన్–1 అభ్యర్థులకు విజయవాడలో, గుంటూరు నుంచి రాయలసీమ వరకు ఉన్న మల్టీ జోన్–2 అభ్యర్థులకు సీతానగరంలో ఈ నెల 16వ తేదీ వరకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పరీక్షలన్నీ పూర్తి పారదర్శకంగా వీడియో రికార్డింగ్ మధ్య నిర్వహిస్తున్నామని, విద్యార్హతలు, వేదార్హతలు, అనుభవం, మౌఖిక పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు చేపడతామని తెలిపారు.

వేదపారాయణదారుల ఎంపిక పూర్తైన అనంతరం అర్చకులు, పరిచారకులు, భజంత్రీలు తదితర పోస్టులను కూడా దశలవారీగా భర్తీ చేస్తామని కమిషనర్ వెల్లడించారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.