శ్రీశైలాన్ని సందర్శించిన రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, దర్శనాలు, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భక్తుల సౌకర్యాలపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన మంత్రి, భక్తుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకుని అవసరమైన మార్పులు చేపట్టాలని సూచించారు.
వాటర్ ఏరోడ్రమ్ టెర్మినల్ ప్రతిపాదిత స్థలం, సున్నిపెంటలో రూ.60 కోట్లతో నిర్మించిన 297 సిబ్బంది నివాస గృహాలను పరిశీలించారు.
అలాగే అంతర్గత రహదారులు, సిబ్బందికి బస్సు సౌకర్యం, శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Comments
Sign in with Google to comment.