Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన ‘యోగాంధ్ర’ కార్యక్రమం

ఇంద్రకీలాద్రిపై యోగాంధ్ర కార్యక్రమం వైభవంగా ప్రారంభం.. జూన్ 21 వరకు ఉచిత యోగా శిక్షణలో పాల్గొనాలని భక్తులకు పిలుపు.

AP/SOUTH

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కే. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం “యోగాంధ్ర” ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. దేవస్థానంలోని మహా మండపం ఆరో అంతస్తులో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ యోగా అధ్యాపకులు శ్రీ గర్రె రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన తొలి రోజు శిక్షణలో దేవస్థాన సిబ్బంది, అర్చకులు, అలాగే పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన విధానాలపై సమగ్ర అవగాహన కల్పిస్తూ ప్రాక్టికల్ శిక్షణ అందించారు.

ఈ వినూత్న కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) స్వయంగా పాల్గొని సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసిక ప్రశాంతతకు నిలయాలైన దేవాలయాలకు మనస్సును ప్రశాంతపరిచే యోగ సాధనకు అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. యోగం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల జూన్ 21 వరకు ప్రతిరోజూ ఉదయం దేవాలయంలో నిర్వహించే ఈ ఉచిత యోగా కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చైర్మన్ పిలుపునిచ్చారు. ‘యోగాంధ్ర’ ప్రారంభ కార్యక్రమంలో దేవస్థాన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కిషోర్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ అవ్వారు శ్రీనివాసరావు, శ్రీ పెనుమత్స రాఘవరాజు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వెలగపూడి శంకరబాబు, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ దేవస్థానం తరఫున ఉచిత ప్రసాదాలు మరియు మంచినీటిని పంపిణీ చేశారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.