Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన ‘యోగాంధ్ర’ కార్యక్రమం

ఇంద్రకీలాద్రిపై యోగాంధ్ర కార్యక్రమం వైభవంగా ప్రారంభం.. జూన్ 21 వరకు ఉచిత యోగా శిక్షణలో పాల్గొనాలని భక్తులకు పిలుపు.

AP/SOUTH

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కే. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం “యోగాంధ్ర” ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. దేవస్థానంలోని మహా మండపం ఆరో అంతస్తులో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ యోగా అధ్యాపకులు శ్రీ గర్రె రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన తొలి రోజు శిక్షణలో దేవస్థాన సిబ్బంది, అర్చకులు, అలాగే పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన విధానాలపై సమగ్ర అవగాహన కల్పిస్తూ ప్రాక్టికల్ శిక్షణ అందించారు.

ఈ వినూత్న కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) స్వయంగా పాల్గొని సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసిక ప్రశాంతతకు నిలయాలైన దేవాలయాలకు మనస్సును ప్రశాంతపరిచే యోగ సాధనకు అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. యోగం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల జూన్ 21 వరకు ప్రతిరోజూ ఉదయం దేవాలయంలో నిర్వహించే ఈ ఉచిత యోగా కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చైర్మన్ పిలుపునిచ్చారు. ‘యోగాంధ్ర’ ప్రారంభ కార్యక్రమంలో దేవస్థాన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కిషోర్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ అవ్వారు శ్రీనివాసరావు, శ్రీ పెనుమత్స రాఘవరాజు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వెలగపూడి శంకరబాబు, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ దేవస్థానం తరఫున ఉచిత ప్రసాదాలు మరియు మంచినీటిని పంపిణీ చేశారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.