Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తుల రద్దీ.. వేసవి ఎండల్లో భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

ఇంద్రకీలాద్రిపై భక్తుల భారీ రద్దీ.. ప్రత్యేక ఏర్పాట్లు, ఉచిత తాగునీరు, అన్నదానంతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించిన అధికారులు.

AP/SOUTH

ఆదివారం సెలవు దినం కావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే భక్తుల రాక గణనీయంగా పెరగడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఏఈవోలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్‌లు క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.

రద్దీ అధికంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీంతో క్యూ లైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం వేగవంతంగా, సులభంగా లభించింది. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ యంత్రాంగం సరికొత్త నీటి సరఫరా విధానాన్ని అమలు చేసింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించారు.

ఈ వినూత్న ఏర్పాటుకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఎండలో నిలబడి ఉన్న తమకు లైన్లలోనే తాగునీరు అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయ పరిసరాల్లో ఉచిత ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించారు.

మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు స్వయంగా క్యూ లైన్లలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకుంటూ తక్షణ చర్యలు తీసుకున్నారు. మరోవైపు అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఇన్‌చార్జ్ ఈఓతో పాటు ఆలయ సిబ్బంది క్యూ లైన్ల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సమర్థవంతంగా నిర్వహించారు. పాలకమండలి, అధికారుల సమన్వయం మరియు సిబ్బంది కృషి ఫలితంగా భారీ రద్దీ ఉన్నప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారి దర్శనం ప్రశాంతంగా సాగింది. ఆలయ యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లు, భక్తులకు కల్పించిన సౌకర్యాలపై సందర్శకులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.