Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించిన ఆదివారం సూర్యోపాసన సేవ

ఇంద్రకీలాద్రిపై ఆదివారం సూర్యోపాసన సేవ వైభవంగా నిర్వహణ.. వేద పారాయణాలు, ప్రత్యేక అర్చనలు, భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ.

AP/SOUTH

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం సూర్యోపాసన సేవ భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడింది.

 లోకకల్యాణం, భక్తుల ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

 ఈ సందర్భంగా వేద పండితులు అరుణ పారాయణం, మహాసౌర పారాయణం, అలాగే సూర్య అష్టోత్తర శతనామావళి పారాయణం నిర్వహిస్తూ సూర్య భగవానుడికి ప్రత్యేక అర్చనలు సమర్పించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ఆలయ వేద పండితులు మాట్లాడుతూ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యోపాసన వల్ల ఆరోగ్యం, తేజస్సు, ఆత్మవిశ్వాసం మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఆదివారం సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజుగా భావించబడుతున్నందున ఈ సేవకు విశేష ప్రాధాన్యత ఉందని వివరించారు. సూర్యోపాసన అనంతరం శ్రీ కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక హారతులు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆదివారం వంటి విశేష దినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సూర్యోపాసన వంటి ఆర్జిత సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందస్తుగా అధికారిక మనమిత్ర వాట్సాప్ సేవలు, దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ kanakadurgamma.org, లేదా దేవస్థానం టికెట్ కౌంటర్ల ద్వారా టికెట్లు పొందవచ్చని సూచించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చక బృందం మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆదిత్య భగవానుడి కృపకు పాత్రులయ్యారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.