సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ఫెర్రీ ఘాట్ వద్ద ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టింది.
ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ ఆధ్వర్యంలో ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు, దేవస్థానం అధికారులు పవిత్ర సంగమం వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.
హారతుల కార్యక్రమం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సహాయ కమిషనర్, వైదిక కమిటీ సభ్యులతో కలిసి సమీక్షించి పలు సూచనలు చేశారు.
Comments
Sign in with Google to comment.