విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి విచ్చేసిన మంత్రికి దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. మంత్రి దర్శన కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వీకే శీనా నాయక్ స్వయంగా పర్యవేక్షణ వహించి, అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి గర్భాలయ సమీపంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందజేయగా, దేవస్థానం అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులతో మాట్లాడారు
Comments
Sign in with Google to comment.