ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి శ్రీమతి ఎస్. సవిత విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని దర్శించుకున్నారు.
తన కుమారుడితో కలిసి ఆలయానికి వచ్చిన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు మంత్రి కుటుంబ సభ్యులకు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం డెప్యూటీ ఈఓ కిశోర్ కుమార్ మంత్రికి అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
Comments
Sign in with Google to comment.