Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఇంద్రకీలాద్రిపై పూర్తి నగదు రహిత సేవలకు శ్రీకారం – వాట్సాప్ ద్వారా దర్శనం, ప్రసాదం టిక్కెట్లు అందుబాటులోకి

ఇంద్రకీలాద్రి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా దర్శనం, ప్రసాదం టిక్కెట్లతో పూర్తి నగదు రహిత సేవలు ప్రారంభం.

AP/SOUTH

ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు పూర్తి నగదు రహిత (100% Cashless) విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా డిజిటల్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం దేవస్థాన ఇంజినీరింగ్, ఐటీ, కౌంటర్లు, భద్రతా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఈవో, అనంతరం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుని దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులు తమ మొబైల్ ఫోన్లలోనే దర్శనం టిక్కెట్లు, సేవా టిక్కెట్లు, లడ్డూ ప్రసాదం టిక్కెట్లు, కేశఖండన టిక్కెట్లు తదితర సేవలను డిజిటల్ చెల్లింపుల ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు.

ఆన్‌లైన్, వాట్సాప్ సేవలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు శ్రీ కనకదుర్గ నగర్ మరియు ఘాట్ రోడ్డులోని ‘ఓం’ టర్నింగ్ వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. అక్కడ హై-స్పీడ్ ఇంటర్నెట్, క్యూ ఆర్ కోడ్ స్టాండ్లు, కంప్యూటర్ సిస్టమ్స్ వంటి సాంకేతిక సదుపాయాలు కల్పించాలని ఐటీ విభాగానికి సూచించారు. భక్తులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించేందుకు తగిన సిబ్బందిని షిఫ్టుల వారీగా విధుల్లో నియమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవి, ఐటీ నిపుణులు, కౌంటర్ల సూపరింటెండెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.