Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రిపై పూర్తి నగదు రహిత సేవలకు శ్రీకారం – వాట్సాప్ ద్వారా దర్శనం, ప్రసాదం టిక్కెట్లు అందుబాటులోకి

ఇంద్రకీలాద్రి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా దర్శనం, ప్రసాదం టిక్కెట్లతో పూర్తి నగదు రహిత సేవలు ప్రారంభం.

AP/SOUTH

ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు పూర్తి నగదు రహిత (100% Cashless) విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా డిజిటల్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం దేవస్థాన ఇంజినీరింగ్, ఐటీ, కౌంటర్లు, భద్రతా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఈవో, అనంతరం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుని దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులు తమ మొబైల్ ఫోన్లలోనే దర్శనం టిక్కెట్లు, సేవా టిక్కెట్లు, లడ్డూ ప్రసాదం టిక్కెట్లు, కేశఖండన టిక్కెట్లు తదితర సేవలను డిజిటల్ చెల్లింపుల ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు.

ఆన్‌లైన్, వాట్సాప్ సేవలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు శ్రీ కనకదుర్గ నగర్ మరియు ఘాట్ రోడ్డులోని ‘ఓం’ టర్నింగ్ వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. అక్కడ హై-స్పీడ్ ఇంటర్నెట్, క్యూ ఆర్ కోడ్ స్టాండ్లు, కంప్యూటర్ సిస్టమ్స్ వంటి సాంకేతిక సదుపాయాలు కల్పించాలని ఐటీ విభాగానికి సూచించారు. భక్తులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించేందుకు తగిన సిబ్బందిని షిఫ్టుల వారీగా విధుల్లో నియమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవి, ఐటీ నిపుణులు, కౌంటర్ల సూపరింటెండెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.