ఇంద్రకీలాద్రి క్షేత్రంలో వేసవి రద్దీ నేపథ్యంలో భక్తులకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దర్శనం సులభంగా కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ క్యూ లైన్ల క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ చర్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా దుర్గా స్నాన ఘాట్, ఘాట్ రోడ్ పనులు, కనకదుర్గానగర్ ప్రాంతాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆయన తనిఖీ చేశారు. క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్ ప్రాంతాల్లో భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకున్నారు.
దుర్గాఘాట్ ప్రాంతంలో హాకర్లు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఈవో, ఇటీవల ప్రారంభించిన మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. ఘాట్ రోడ్ మూసివేత కారణంగా కనకదుర్గానగర్ వైపు పెరిగిన భక్తులు, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు.
దేవస్థానానికి ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సుల ఏర్పాట్లను కూడా ఈవో శీనా నాయక్ పరిశీలించారు.
Comments
Sign in with Google to comment.