వేసవి సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో మే 29 నుంచి జూన్ 1 వరకు నాలుగు రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు. ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు వెల్లడించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన దర్శనం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భక్తుల కోసం క్యూకాంప్లెక్స్లో ఉదయం వేళ వేడి పాలు, మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు నిరంతరం అందజేస్తున్నట్లు తెలిపారు. ఆలయ క్యూలైన్లలో కూడా తాగునీటి సౌకర్యం కల్పించామని చెప్పారు.
అదేవిధంగా క్షేత్ర పరిధిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో భక్తులకు మంచినీటితో పాటు మజ్జిగ కూడా అందజేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు ఈ మార్పును గమనించి దేవస్థానానికి సహకరించాలని ఈవో కోరారు.
Comments
Sign in with Google to comment.