ఎన్. టి. ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శ సోమవారం సాయంత్రం ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దేవస్థానం ఈవో వికే సిన నాయక్ కలెక్టర్కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
కలెక్టర్ శ్రీ లక్ష్మి శ దేవస్థానంలోని ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగుల వివరాల రిజిస్టర్ను పరిశీలించి వైద్య సేవల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.
వేసవి ఎండల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు వెంటనే వైద్య సహాయం అందేలా శివాలయం వైపు, ఘాట్ రోడ్ వైపు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈవో వీ.కే. శీనా నాయక్ను ఆదేశించారు.ఈ సందర్భంగా రాజగోపురం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్ర రాధాకృష్ణ (గాంధీ)తో పాటు ధర్మకర్తల మండలి సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
అనంతరం మహామండపం వైపు నుంచి ఆలయ అధికారులు, ధర్మకర్తలతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు.
Comments
Sign in with Google to comment.