Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

శ్రీశైల దేవాలయం లో అన్నప్రసాద వితరణను పరిశీలించిన ఈఓ శ్రీనివాసరావు

శ్రీశైల దేవాలయంలో అన్నప్రసాద సేవలపై ఈఓ శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

AP/SOUTH

శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద వితరణ సేవలను కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు.

 పరిపాలనాంశాల సమీక్షలో భాగంగా ఆయన అన్నప్రసాద వితరణ భవనాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా అన్నప్రసాద వితరణ భవనంలోని విరాళాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన ఈఓ, అనంతరం అధికారులతో సమావేశమై భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించిన శ్రీనివాసరావు, భోజనం స్వీకరిస్తున్న భక్తులతో నేరుగా మాట్లాడి వడ్డన, రుచి, పరిశుభ్రత వంటి అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

 అన్నప్రసాద వితరణలో శివసేవకుల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా శివసేవకులకు ప్రత్యేక అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి హాల్లో అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. వండిన ప్రతి వంటకం ప్రతి భక్తుడికి అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే అన్ని హాల్స్‌లో సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. అన్నప్రసాద వంటకాలు రుచికరంగా, నాణ్యంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తాజా కూరగాయలను మాత్రమే వినియోగించాలని సూచించారు. అదేవిధంగా వంటశాల, ప్రసాద వితరణ హాల్స్‌, భవన ప్రాంగణంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.