Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవాలయం లో భారీగా భక్తుల రద్దీ వేసవి ఎండల్లో భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

వేసవి ఎండల్లో ఆలయంలో భారీ భక్తుల రద్దీ మధ్య ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, చల్లని తాగునీరు, అన్నప్రసాదం అందించిన అధికారులు.

AP/SOUTH

శ్రీశైల దేవస్థానం లో వేసవి సెలవులు, ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఆదివారం ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు భక్తులతో నిండిపోవడంతో ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన, సౌకర్యాల ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, భక్తులందరికీ సంతృప్తికరంగా శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకునేలా ఆలయ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజు ఉదయం 6 గంటలకు క్యూ కాంప్లెక్స్‌లో వేడి పాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈరోజు భక్తులకు అల్పాహారంగా కట్టుపొంగలి, పులిహోర, పెరుగన్నం పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు నిరంతరం అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి, భక్తులకు చల్లని తాగునీరు, మజ్జిగ అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ప్రాతఃకాల సేవలను నిర్వహించిన అనంతరం ఉదయం 4.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దర్శనాలు కొనసాగించామని తెలిపారు. తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి దర్శనాలు పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ ఉదయం కార్యనిర్వహణాధికారి ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లను పరిశీలించి భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సేవలు అందిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.