Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

సున్నిపెంట భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ రాజకుమారి

సున్నిపెంట భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారంతో పాటు రోడ్లు, తాగునీటి అభివృద్ధి పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది.

AP/SOUTH

సున్నిపెంట ప్రాంత భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంగళవారం సున్నిపెంటలో రూ.10 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను తో కలిసి ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ శ్రీశైలం డ్యామ్ పరిసర ప్రాంతాల అభివృద్ధి, భూముల వినియోగం, ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

సున్నిపెంటలో మరిన్ని డ్రైనేజీలు, అంతర్గత రహదారుల నిర్మాణానికి ఇప్పటికే అంచనాలు సిద్ధం చేశామని, త్వరలో పరిపాలనా అనుమతులు పొందనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం కోసం గతంలో అటవీ భూములను డీ-రిజర్వ్ చేసి సుమారు 1468 ఎకరాలు కేటాయించారని, ప్రస్తుతం 1427 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ఆధునిక సర్వేలో గుర్తించామని కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో 5,824 నిర్మాణాలు, 22 వేలకుపైగా జనాభా ఉన్నట్లు తెలిపారు. ప్రజల అభిప్రాయాల సేకరణ ప్రక్రియను పొడిగించి, దరఖాస్తుల స్వీకరణకు అదనపు గడువు ఇచ్చినట్లు చెప్పారు.

ప్రజల వినతిపత్రాలు, రిటన్ స్టేట్మెంట్లను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వం, న్యాయస్థానానికి పూర్తి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. అక్రమ ఆక్రమణలు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్ ప్రజల  రిటన్ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఇళ్లను ఖాళీ చేయించబోమని భరోసా ఇచ్చారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ సున్నిపెంట ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.

 ఇప్పటికే రోడ్లు, తాగునీటి పనులకు రూ.10 కోట్లు మంజూరు చేశామని, త్వరలో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించే చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామంలోని సీసీ రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, అర్హులైన వారికి పక్కా గృహాలు కూడా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.