Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యాలు, పరిశుభ్రతపై ఈవో శీనా నాయక్ సమీక్ష

ఇంద్రకీలాద్రిలో భక్తుల సౌకర్యాలు, పరిశుభ్రత, తాగునీరు, అన్నప్రసాద నాణ్యత మెరుగుపై ఈవో శీనా నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు

AP/SOUTH

ఇంద్రకీలాద్రిలో భక్తుల సౌకర్యాలు, పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధిపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సమీక్ష నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో కలిసి శుక్రవారం మహా మండపం నాలుగో అంతస్తులో ఇంజినీరింగ్, శానిటేషన్ మరియు ఇతర ప్రధాన విభాగాల అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమీక్షలో భాగంగా దుర్గా ఘాట్ స్నానాల రేవు నుంచి కనకదుర్గ నగర్, ఘాట్ రోడ్డు, మహా మండపం సహా ఆలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఈవో ఆదేశించారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘాట్ రోడ్డు టోల్ గేట్ నుంచి ‘ఓం’ టర్నింగ్ వరకు రోడ్డు బలోపేత పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనుల కారణంగా కొద్ది రోజుల పాటు ఘాట్ రోడ్డును మూసివేసే అవకాశం ఉన్నందున, భక్తులకు ఇబ్బందులు కలగకుండా కనకదుర్గ నగర్‌లో ప్రత్యామ్నాయ మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని సూచించారు. ఇంజినీరింగ్ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించాలని ఈవో స్పష్టం చేశారు. ఏఈలు, డీఈలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యతను మరింత మెరుగుపరచాలని, పరిశుభ్రతతో పాటు రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో భక్తులకు నిరంతర తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఈవో శీనా నాయక్ ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.