Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

మనమిత్ర వాట్సప్ ద్వారా దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులోకి

మనమిత్ర వాట్సప్ ద్వారా శ్రీశైలంలో దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, విరాళాల చెల్లింపులు భక్తులకు సులభంగా అందుబాటులోకి వచ్చాయి.

AP/SOUTH

శ్రీశైల దేవస్థానం భక్తులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు “మనమిత్ర” వాట్సప్ సేవలను విస్తరించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు. ఇకపై శ్రీస్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు కూడా మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దర్శన టికెట్లతో పాటు మొత్తం 18 రకాల ఆర్జిత సేవా టికెట్లు కూడా మనమిత్ర ద్వారా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా భక్తులు విరాళాలను కూడా ఈ వాట్సప్ సేవ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. భక్తులకు మనమిత్ర సేవలపై అవగాహన కల్పించేందుకు క్షేత్ర పరిధిలో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే క్యూ కాంప్లెక్స్ ఎదుట మనమిత్ర సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, సి.ఆర్.ఓ కార్యాలయం, గణేశ్ సదన్ తదితర ప్రాంతాల్లో కూడా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరోక్ష సేవా టికెట్లను కూడా మనమిత్ర ద్వారా పొందే సదుపాయం కల్పించినట్లు ఈఓ తెలిపారు. శ్రీశైలానికి స్వయంగా రాలేని భక్తులు తమ గోత్రనామాలతో పరోక్షంగా సేవలు నిర్వహించుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో భాగంగా పలు శాఖలకు సంబంధించిన సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ మనమిత్ర సేవ ద్వారా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లతో పాటు ఆర్జిత గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్ర హోమం, మహామృత్యుంజయ హోమం, చండీ హోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం వంటి 18 రకాల సేవా టికెట్లు పొందవచ్చని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యనిర్వహణాధికారి కోరారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.