Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

మనమిత్ర వాట్సప్ ద్వారా దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులోకి

మనమిత్ర వాట్సప్ ద్వారా శ్రీశైలంలో దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, విరాళాల చెల్లింపులు భక్తులకు సులభంగా అందుబాటులోకి వచ్చాయి.

AP/SOUTH

శ్రీశైల దేవస్థానం భక్తులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు “మనమిత్ర” వాట్సప్ సేవలను విస్తరించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు. ఇకపై శ్రీస్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు కూడా మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దర్శన టికెట్లతో పాటు మొత్తం 18 రకాల ఆర్జిత సేవా టికెట్లు కూడా మనమిత్ర ద్వారా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా భక్తులు విరాళాలను కూడా ఈ వాట్సప్ సేవ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. భక్తులకు మనమిత్ర సేవలపై అవగాహన కల్పించేందుకు క్షేత్ర పరిధిలో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే క్యూ కాంప్లెక్స్ ఎదుట మనమిత్ర సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, సి.ఆర్.ఓ కార్యాలయం, గణేశ్ సదన్ తదితర ప్రాంతాల్లో కూడా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరోక్ష సేవా టికెట్లను కూడా మనమిత్ర ద్వారా పొందే సదుపాయం కల్పించినట్లు ఈఓ తెలిపారు. శ్రీశైలానికి స్వయంగా రాలేని భక్తులు తమ గోత్రనామాలతో పరోక్షంగా సేవలు నిర్వహించుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో భాగంగా పలు శాఖలకు సంబంధించిన సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ మనమిత్ర సేవ ద్వారా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లతో పాటు ఆర్జిత గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్ర హోమం, మహామృత్యుంజయ హోమం, చండీ హోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం వంటి 18 రకాల సేవా టికెట్లు పొందవచ్చని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యనిర్వహణాధికారి కోరారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.