Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రిపై భక్తులకు చల్లని మజ్జిగ, తాగునీటి పంపిణీ

ఇంద్రకీలాద్రిపై వేసవి కాలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత తాగునీరు, చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.

AP/SOUTH

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మరియు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ వి.కె. శీనా నాయక్ ఆదేశాల మేరకు, వేసవి కాలం ముగిసే వరకు భక్తులకు ఉచిత తాగునీరు మరియు చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమంను విస్తృతంగా అమలు చేస్తున్నారు. దేవస్థానం తరఫున ప్రతిరోజూ కొండపైకి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు నిరంతర ఉచిత తాగునీటి సదుపాయం కల్పించారు. అదేవిధంగా, ఉగాది పర్వదినం నుంచి జూన్ 15వ తేదీ వరకు నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 2,000 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్న దేవస్థానం, భక్తుల రద్దీ అధికంగా ఉండే శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో 5,000 మజ్జిగ ప్యాకెట్లు లేదా అంతకంటే ఎక్కువ పంపిణీ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే దాతలు రోజుకు కేవలం రూ.650 చెల్లించి, అధికారిక రశీదు పొంది ఈ పథకానికి విరాళం అందించవచ్చని ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. వేసవిలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్న ఆయన, ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పత్రికా ప్రతినిధులను కోరారు. అలాగే, అధిక సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.