Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

US Israel Iran War Live: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరో తెలుసా..? అమెరికాను అంతం చేస్తామని శపథం..

US Israel attack Iran Live Updates : అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధృవీకరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు

War News

US Israel attack Iran Live Updates : అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధృవీకరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖమేనీ మృతి చెందారని ప్రకటించారు. తొలుత దీనిని ఇరాన్ ఖండించింది. చివరకు ఖమేనీ చనిపోయినట్లు ఆ దేశ సైన్యంతో పాటు మీడియా కన్ఫార్మ్ చేసింది.

  • ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. లేటెస్ట్ అప్ డేట్స్

     
    • 01. ఇరాన్‌ సుప్రీం ఖొమేనీ మృతిని ఇజ్రాయెల్‌లో ఉంటున్న ఇరానియన్లు సమర్థించారు. రాచరికపు పాలనకు ముగింపు దొరికిందంటూ హర్షం ప్రకటించారు. ట్రంప్‌కు మద్దతుగా డాన్సులు చేశారు.
    • 02. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను చైనా ఖండించింది. ఇరాన్‌ సార్వభౌమత్వం, సమగ్రతను పరిరక్షించాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని కోరింది.
    • 03. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను కెనడా ప్రధాని కార్నీ ఖండించారు. తక్షణమే దాడులను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ దుందుడుకు చర్యలను ప్రపంచదేశాలు ఖండించాలని కోరారు.
    • 04. ఖొమినీ మృతిపై ఇరాక్‌ బాగ్దాద్‌లో షియా ముస్లింలు వేలాదిగా రోడ్డెక్కారు. అమెరికా ఎంబసీ దగ్గర నినాదాలతో హోరెత్తించారు. ఎంబసీ ముట్టడికి యత్నించిన ఆందోళన కారులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.
    • 05. ఖొమేనీ మృతికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ కరాచీలో ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళన కారులు అమెరికా ఎంబసీని ధ్వంసం చేశారు. ఎంబసీకి నిప్పుపెట్టేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు కాల్పులకు దిగడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
    • 06. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దాడులతో వణికిపోయామని స్టార్ షట్లర్ PV సింధు చెప్పారు. దుబాయ్‌లో పరిస్థితులపై ఆమె ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ దగ్గర ఇరాన్‌ బాంబుల దాడితో భయంతో పరుగులు తీశామన్నారు.
    • 07. ఫ్యామిలీతో దుబాయ్‌లో ఉన్న సినీ నటుడు మంచు ఇరాన్‌ దాడులపై స్పందించారు. డ్రోన్‌ దాడులతో భయపెట్టాయన్నారు. దాడి దృశ్యాలను వీడియో తీసి పోస్ట్‌ చేశారు
    • 08. దుబాయ్‌పై ఇరాన్‌ దాడులతో తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియక క్షణమొక యుగంలా బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    • 09. ఇరాన్‌ దాడులతో ఉద్రిక్తంగా మారిన దుబాయ్‌లో సినీ నటి సోనాల్ చౌహాన్ చిక్కుకున్నారు. తనను క్షేమంగా భారత్‌కు తీసుకెళ్లాలని భారత ఎంబసీని ఎక్స్‌ వేదికగా వేడుకున్నారు.  

      దుబాయ్‌లో చిక్కుకున్న బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు

      ఇరాన్ దాడుల నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. పేలుడు సంభవించినప్పుడు నేను విమానాశ్రయం దగ్గరే ఉన్నా.. దట్టమైన పొగ ఆవరించిందిం, వెంటనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.. ఆ క్షణాలు ఎంతో భయంకరం.. అన్నారు.. సంక్షోభ సమయంలో ఏర్‌పోర్ట్ స్టాఫ్, అధికారులు, భారత హైకమిషన్ స్పందించిన తీరును మెచ్చుకున్నారామె. పరిస్థితులు త్వరలోనే చక్కబడాలని కోరుకుంటున్నా అన్నారు. పీవీ సింధు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నమెంట్‌ కోసం బర్మింగ్‌హామ్‌ వెళ్ళాల్సి ఉంది. ట్రాన్సిట్ స్టాప్ కనుక దుబాయ్‌లో ఆగారు.

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.