Latest
నేపాల్ లో మునిగిన వరదలు: మృతుల సంఖ్య 538 కు చేరింది; కొత్త వరద ప్రమాదం కొనసాగుతోంది. Nepal Floods: 470 దాటిన మృతులు.. మళ్లీ భారీ వరద ముప్పు, టిబెట్ వైపు డ్యామ్ అలర్ట్ ‘ధనికులకు ఓ న్యాయం.. పేదలకు మరో న్యాయం’: జీ గ్రూప్ సుభాష్ చంద్ర వ్యవహారంపై రాహుల్ గాంధీ ఫైర్ వర్షాకాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు.. మళ్లీ మన సంప్రదాయ రుచుల వైపు మొగ్గు లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లో మునిగిన వరదలు: మృతుల సంఖ్య 538 కు చేరింది; కొత్త వరద ప్రమాదం కొనసాగుతోంది. Nepal Floods: 470 దాటిన మృతులు.. మళ్లీ భారీ వరద ముప్పు, టిబెట్ వైపు డ్యామ్ అలర్ట్ ‘ధనికులకు ఓ న్యాయం.. పేదలకు మరో న్యాయం’: జీ గ్రూప్ సుభాష్ చంద్ర వ్యవహారంపై రాహుల్ గాంధీ ఫైర్ వర్షాకాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు.. మళ్లీ మన సంప్రదాయ రుచుల వైపు మొగ్గు లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.

‘ధనికులకు ఓ న్యాయం.. పేదలకు మరో న్యాయం’: జీ గ్రూప్ సుభాష్ చంద్ర వ్యవహారంపై రాహుల్ గాంధీ ఫైర్

సుభాష్ చంద్ర ₹22,006 కోట్ల క్లెయిమ్‌లకు కేవలం ₹6.5 కోట్ల సెటిల్‌మెంట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు. ధనికులకు, సామాన్యులకు వేర్వేరు న్యాయమని ఆరోపణలు.

India

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త, జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆమోదం తెలపడం రాజకీయ దుమారం రేపుతోంది. సుమారు ₹22,006.57 కోట్ల క్లెయిమ్‌లకు కేవలం ₹6.5 కోట్ల చెల్లింపుతో పరిష్కారం చూపే ప్రణాళికకు అనుమతి లభించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

 ఈ వ్యవహారం దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో ధనికులు, సామాన్యుల పట్ల వేర్వేరు ప్రమాణాలు ఉన్నాయనే తన ఆరోపణకు నిదర్శనమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ‘‘ఇండియాలో రెండు వ్యవస్థలు ఉన్నాయి’’ అంటూ ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

చిన్న మొత్తాల ఈఎంఐలు చెల్లించడంలో ఆలస్యం చేసిన సామాన్య రుణగ్రహీతలపై బ్యాంకులు ఒత్తిడి తెస్తాయని, అదే సమయంలో భారీ మొత్తాల్లో బకాయిలు ఉన్న సంపన్నులకు పెద్ద మొత్తంలో రాయితీలు లభిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ధనికులకు ఒక న్యాయం, మిగతా ప్రజలకు మరో న్యాయం అన్నట్లుగా వ్యవస్థ పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

NCLT ఆమోదించిన ప్రణాళిక ప్రకారం సుభాష్ చంద్రకు సంబంధించిన సుమారు ₹22,006.57 కోట్ల అంగీకరించిన క్లెయిమ్‌లపై రుణదాతలకు కేవలం ₹6.25 కోట్ల చెల్లింపు, మరో ₹25 లక్షలు దివాలా ప్రక్రియ ఖర్చుల కోసం కేటాయించారు. దీంతో రుణదాతల రికవరీ దాదాపు 0.03 శాతానికే పరిమితం కాగా, హెయిర్‌కట్ సుమారు 99.97 శాతంగా ఉంది.

అయితే ఈ కేసులో ఉన్న క్లెయిమ్‌లు సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్న ₹22,000 కోట్ల రుణాలు కావని, ఎస్సెల్ గ్రూప్‌కు చెందిన సంస్థల రుణాలకు ఆయన ఇచ్చిన వ్యక్తిగత హామీలకు సంబంధించినవని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ భారీ హెయిర్‌కట్‌పై పలువురు రుణదాతలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, NCLT ప్రణాళికను ఆమోదించింది. ఈ పరిణామం నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ, దివాలా చట్టాల అమలుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది

Related Stories

Latest Articles

  1. నేపాల్ లో మునిగిన వరదలు: మృతుల సంఖ్య 538 కు చేరింది; కొత్త వరద ప్రమాదం కొనసాగుతోంది.
  2. Nepal Floods: 470 దాటిన మృతులు.. మళ్లీ భారీ వరద ముప్పు, టిబెట్ వైపు డ్యామ్ అలర్ట్
  3. వర్షాకాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు.. మళ్లీ మన సంప్రదాయ రుచుల వైపు మొగ్గు
  4. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  5. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  6. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  7. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  8. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  9. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  10. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
Comments

Sign in with Google to comment.