Latest
🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.

శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్లు ప్రారంభం

శ్రీశైలంలో కియోస్క్ మిషన్లు ప్రారంభం; దర్శనం, ప్రసాదం, కేశఖండన టికెట్లు, విరాళాలు సులభం, పలు కేంద్రాల్లో ఏర్పాటు, డిజిటల్ సేవలు విస్తరణ.

Devotional/Cultural

భక్తులకు మరింత సులభతర సేవలు అందించేందుకు శ్రీశైలం దేవస్థానం కీలక చర్యలు చేపట్టింది. దేవస్థానం పరిధిలో పలుచోట్ల సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేసి, లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్‌లను మంగళవారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రారంభించారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఈ మిషన్లు ప్రారంభించబడ్డాయి. ఈ కియోస్క్‌ల ద్వారా భక్తులు దర్శనం, ప్రసాదం, కేశఖండన టికెట్లను సులభంగా పొందవచ్చు. అలాగే దేవస్థానం వివిధ పథకాల కోసం విరాళాలు కూడా చెల్లించేందుకు వీలుంది. సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, మల్లికార్జునసదన్, గంగాసదన్, కల్యాణకట్ట, పాత విరాళాల కేంద్రం మరియు గంగాధర మండపం వద్ద ఉన్న కొత్త విరాళాల కేంద్రాల్లో కూడా ఈ కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు మాట్లాడుతూ, భక్తులకు సాంకేతిక ఆధారిత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కియోస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా భక్తులు టికెట్లను స్వయంగా పొందే అవకాశం కలుగుతుందని, దీని వల్ల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా దేవస్థానానికి సంబంధించిన 17 రకాల టికెట్లను ముందస్తుగా పొందే సౌకర్యం అందుబాటులో ఉంది. అదేవిధంగా దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ www.srisailadevasthanam.org⁠� మరియు దేవదాయశాఖ వెబ్‌సైట్ www.aptemples.ap.gov.in⁠� ద్వారా కూడా దర్శనం, ఆర్జిత సేవ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

కాగా ఈ కియోస్క్ మిషన్లను కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా కరూర్ వైశ్య బ్యాంక్ దేవస్థానానికి అందజేసింది.

Related Stories

Latest Articles

  1. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది
  2. బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది.
  3. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది.
  4. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది.
  5. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.
  6. 💥 రూపాయి కుప్పకూలింది: అమెరికా డాలర్‌కు 95.46కి పడిపోయింది, ఆర్థిక ఆందోళనలు కలిగించింది.
  7. కోహినూర్ బంగారం వివాదం మళ్లీ చెలరేగింది, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ అడమ్స్‌ను 'భారతదేశానికి తిరిగి ఇవ్వండి' డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
  8. కరణ్ కుంద్రా & తేజస్వి ప్రకాష్ వివాహ వార్త: బిగ్ బాస్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు
  9. యూఏఈ ఆయిల్ మార్పు సౌదీ విరోధాన్ని బహిర్గతం చేస్తోంది, కొత్త గల్ఫ్ శక్తి సమతుల్యతను సంకేతం చేస్తోంది.
  10. నాగా రైడర్ ఫ్రాన్స్‌లో దూసుకుపోతున్నాడు: కెఖ్రీసిలీ రియో హారస్ డి లివర్డీలో గ్రాండ్ ప్రీని గెలిచాడు.
Comments

Sign in with Google to comment.