భక్తులు మరియు పర్యాటకుల కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐ ఆర్ సి టి సి దక్షిణ మధ్య మండలం ప్రత్యేకంగా భారత్ గౌరవ్ పర్యాటక రైలు’ ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక రైలు ఏప్రిల్ 27, 2026న విశాఖపట్నం నుంచి బయలుదేరి, అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం సహా ప్రముఖ దక్షిణ భారత పుణ్యక్షేత్రాలను సందర్శించే దివ్య దక్షిణ యాత్రను నిర్వహించనుంది. ఈ యాత్ర ఏప్రిల్ 27 నుంచి మే 4, 2026 వరకు మొత్తం 8 రోజులు / 7 రాత్రులు కొనసాగుతుంది. యాత్రలో కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, తిరుచి, తంజావూరు, తిరువణ్ణామలై వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రదేశాలు కవర్ చేయబడతాయి. రైలు విశాఖపట్నం నుంచి తుని, సామల్కోట్, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మార్గంగా ప్రయాణిస్తుంది. IRCTC ప్రకటించిన వివరాల ప్రకారం, స్లీపర్ క్లాస్ ఎకానమీ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.14,700, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13,800గా నిర్ణయించారు. ప్యాకేజీలో రైలు ప్రయాణం, బడ్జెట్ హోటళ్లలో వసతి, స్థానిక రవాణా, శాఖాహార భోజనం, ప్రయాణ బీమా, టూర్ ఎస్కార్ట్ సేవలు, IRCTC టూర్ మేనేజర్ సపోర్ట్, వర్తించే పన్నులు ఉంటాయి. బుకింగ్ మరియు మరిన్ని వివరాల కోసం ప్రయాణికులు IRCTC విజయవాడ కార్యాలయంను సంప్రదించవచ్చు లేదా IRCTC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు.
ఐ ఆర్ సి టి సి ‘భారత్ గౌరవ్’ టూరిస్ట్ రైలు: అరుణాచలం సహా దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక ప్యాకేజీ
ఐ ఆర్ సి టి సి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఏప్రిల్ 27న విశాఖ నుంచి దివ్య దక్షిణ యాత్రకు బయలుదేరనుంది; అరుణాచలం సహా పుణ్యక్షేత్రాల దర్శనం.
Comments
Sign in with Google to comment.