దేవాలయాల్లో భక్తులకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచి, వారి సంతృప్తి స్థాయిని పెంచాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.
మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆలయాల నిర్వహణ, సౌకర్యాలు, పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించారు. దర్శనం, అన్నప్రసాదం, మంచినీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల్లో భక్తుల నుండి కనీసం 80 శాతం సానుకూల స్పందన వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్నప్రసాదం తయారీలో ఆధునిక పద్ధతులు వినియోగించి నాణ్యత, వేగం పెంచాలని, అలాగే సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దుర్గమ్మ ఆలయ ఈవో శీనా నాయక్, ఈఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.