Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చారిత్రక మైలురాయి దిశగా మోదీ.. శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చారిత్రక ఘనత సాధించనున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.

Telangana/karnataka

దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా చారిత్రక మైలురాయిని చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీపై దేశ ప్రజలు ఉంచిన అపార విశ్వాసానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం లోక్ భవన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గవర్నర్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికాభివృద్ధి, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్ఠ మరింత పెరిగిందని, జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశాన్ని అభివృద్ధి చెందిన శక్తిగా తీర్చిదిద్దనున్నాయని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరిన్ని విజయాలు సాధిస్తూ అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. “తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో దేశం మరింత ప్రగతి, సుసంపన్నత సాధించి ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు 

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.