రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జరిగిన మ్యాచ్ల సందర్భంగా భద్రతా నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన ఉప్పల్ పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు. మ్యాచ్ల సమయంలో ప్రేక్షకుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణలో విశేషంగా పనిచేసిన ఉప్పల్ సబ్ఇన్స్పెక్టర్లు చిరంజీవి, మధు, హెడ్ కానిస్టేబుల్ జంగయ్యలకు స్మారక చిహ్నాలు అందజేసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ వెంకట్ రెడ్డి, ఎస్ హెచ్ ఓ రామలింగారెడ్డి,డీఐ రవికుమార్ పాల్గొన్నారు.
భారత క్రికెటర్ అభిషేకరణ కూడా కార్యక్రమానికి హాజరై పోలీసు సిబ్బంది సేవలను అభినందించారు. భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చినప్పటికీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి మ్యాచ్లను ప్రశాంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Sign in with Google to comment.