రామంతాపూర్ డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన మురుగునీటి, తాగునీటి అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు గంథం నాగేశ్వరావుతో కలిసి జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వార్డు నెం.26 పరిధిలోని నెహ్రూ నగర్, ఎండోమెంట్ కాలనీ, రాంశంకర్ నగర్, గాంధీనగర్, శ్రీరామకాలనీ, గణేష్ నగర్, నేతాజీ నగర్, రాజేంద్రనగర్, ప్రగతి నగర్, గోఖలే నగర్ తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న మురుగునీటి పైపులైన్ల పునర్నిర్మాణం, కొత్త వాటర్ లైన్ల ఏర్పాటు, సిల్టెడ్ SWG లైన్ల మార్పిడి వంటి అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. మొత్తం రూ.2 కోట్ల 57 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సానుకూలంగా స్పందించి, సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
రామంతాపూర్ అభివృద్ధి పనులకు రూ.2.57 కోట్ల ప్రతిపాదనలు
రామంతాపూర్ డివిజన్లో మురుగునీటి, తాగునీటి అభివృద్ధి పనులకు రూ.2.57 కోట్ల ప్రతిపాదనలు సమర్పించగా, త్వరలో పనులు ప్రారంభిస్తామని జల మండలి అధికారులు తెలిపారు.
Comments
Sign in with Google to comment.