Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఉద్యమకారుల గౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది: ఎమ్మెల్సీ విజయశాంతి

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని భరోసా

Telangana/karnataka

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల గౌరవం, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ విజయశాంతి స్పష్టం చేశారు. శాసనమండలిలో ఉద్యమకారుల సమస్యలను సానుకూలంగా ప్రస్తావించిన ఆమె, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్వరలోనే అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర అపారమైందని, వారి త్యాగాలు, పోరాటాలు, సమర్పణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఉద్యమకారులకు కేవలం గౌరవం ఇవ్వడం మాత్రమే కాకుండా, వారి సంక్షేమం కోసం ప్రకటించిన హామీలను అమలు చేయడం కూడా ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఉద్యమకారులు ఎమ్మెల్సీ విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలిలో తమ సమస్యలను సానుభూతితో, సానుకూల దృక్పథంతో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

 ఉద్యమకారులతో ఆప్యాయంగా ముచ్చటించిన విజయశాంతి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతుందని, ఉద్యమకారుల సంక్షేమం పట్ల పార్టీ పూర్తి నిబద్ధతతో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం దశలవారీగా ఉద్యమ సైనికుల కోసం ప్రకటించిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని ఆమె తెలిపారు.

 

అలాగే, ఉద్యమకారుల ఆత్మగౌరవం, గౌరవప్రదమైన జీవనం, వారి కుటుంబాల భద్రత కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్సీ విజయశాంతి హామీ ఇచ్చారు. ఆమె వ్యక్తం చేసిన ఆప్యాయత, నమ్మకానికి ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.