Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

దక్షిణ మధ్య రైల్వేకు చరిత్రాత్మక రికార్డు.. 144.244 మిలియన్ టన్నుల సరుకు రవాణా

2025–26 ఆర్థిక సంవత్సరంలో మార్చి 24 నాటికి 144.244 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధించి దక్షిణ మధ్య రైల్వే చారిత్రక రికార్డు నమోదు చేసింది.

Telangana/karnataka

దక్షిణ మధ్య రైల్వే (SCR) తన చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక సరుకు రవాణా లోడింగ్‌ను నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో మార్చి 24, 2026 వరకు మొత్తం 144.244 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధించి అత్యుత్తమ పనితీరును ప్రదర్శించింది.

ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా వారం రోజుల సమయం ఉండగానే ఈ ఘనతను అందుకోవడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం 2024–25లో నమోదైన 144.14 మిలియన్ టన్నుల అత్యుత్తమ లోడింగ్‌ను ఈసారి దక్షిణ మధ్య రైల్వే అధిగమించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాలు సరుకు రవాణా వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయి. ముఖ్యంగా బొగ్గు, సిమెంట్ రవాణాలో జోన్ పటిష్టమైన స్థాయిని కొనసాగించడంతో పాటు, కొత్త రకాల సరుకులను కూడా రవాణా వ్యవస్థలో చేర్చి ఆదాయ వనరులను విస్తరించింది.

 ప్రధాన సరుకు రవాణా వివరాలు ఇలా ఉన్నాయి: బొగ్గు – 66.878 మిలియన్ టన్నులు సిమెంట్ – 37.572 మిలియన్ టన్నులు ఇనుప ఖనిజం – 8.620 మిలియన్ టన్నులు ఎరువులు – 8.038 మిలియన్ టన్నులు ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు – 4.810 మిలియన్ టన్నులు ఆహార ధాన్యాలు – 6.225 మిలియన్ టన్నులు కంటైనర్లు – 2.561 మిలియన్ టన్నులు పెట్రోలియం ఉత్పత్తులు – 1.223 మిలియన్ టన్నులు ఇతర వస్తువులు – 8.349 మిలియన్ టన్నులు

దక్షిణ మధ్య రైల్వే అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని అధికారులు తెలిపారు. సరుకు రవాణా వినియోగదారులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల మెరుగుదల, టెర్మినల్స్‌లో పని వాతావరణం అభివృద్ధి, గూడ్స్ షెడ్ల విస్తరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అదనంగా, వినియోగదారుల అవసరాలను సమయానుకూలంగా పరిష్కరించేందుకు అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. సాంప్రదాయ సరుకులతో పాటు కొత్త సరుకులను గుర్తించి, పోర్ట్ లోడింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా ఈ రికార్డు సాధనలో కీలకంగా నిలిచింది.

 

 

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.