Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

తెలంగాణ రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు,

కాంగ్రెస్ తరఫున సింఘ్వీ, నరేందర్ రెడ్డి రాజ్యసభ నామినేషన్లు దాఖలు; బీఆర్‌ఎస్ బరిలో లేక ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమం.

Telangana/karnataka

తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ మరియు వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి వారు నామినేషన్ పత్రాలు సమర్పించారు. సింఘ్వీ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, వేం నరేందర్ రెడ్డి నాలుగు సెట్లు సమర్పించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి ఒకే సెట్తో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియగా, 10 మంది ఎమ్మెల్యేల మద్దతు సంతకాలు లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ అభ్యర్థిని బరిలో నిలపకపోవడంతో అభిషేక్ మను సింఘ్వీ మరియు వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవంగా ఖరారు కానుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సింఘ్వీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది. మరో స్థానానికి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, చివరికి వేం నరేందర్ రెడ్డికి పార్టీ టికెట్ దక్కింది.

 

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.