Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ కొత్త రాజకీయం.. షర్మిలకు రాజ్యసభ ఛాన్స్?

ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ కొత్త రాజకీయ వ్యూహం రచిస్తోంది. షర్మిలకు రాజ్యసభ అవకాశం కల్పించే దిశగా హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Politics

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయ వ్యూహానికి శ్రీకారం చుడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్‌, ఏపీసీసీ అధ్యక్షురాలు Y. S. Sharmilaకు రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

కర్ణాటక నుంచి కాంగ్రెస్‌కు దక్కనున్న మూడు రాజ్యసభ స్థానాలపై ఇప్పటికే పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. సీనియర్ నేతలు బీకే హరిప్రసాద్‌, రాజీవ్ గౌడలతో పాటు ఢిల్లీకి చెందిన పార్టీ అధికార ప్రతినిధులు పవన్ ఖేడా, సుప్రియా శ్రీనటే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే జాబితాలో షర్మిల పేరు ప్రాధాన్యంగా చర్చకు రావడం ఆసక్తికరంగా మారింది. 

గతంలోనే కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi షర్మిలకు రాజ్యసభ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు ఆమెకు జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించే దిశగా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 ఏపీలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబానికి ఉన్న ప్రజాదరణను కాంగ్రెస్‌కు అనుకూలంగా మలచాలని పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.

అయితే షర్మిలకు పార్టీ అంతర్గత సమన్వయ బాధ్యతలు కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం పెంచి, కేడర్‌ను మళ్లీ చురుకుగా మార్చాలని ఆమెకు స్పష్టమైన టాస్క్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కర్ణాటకలో సీఎం మార్పుపై అధికారిక ప్రకటన, ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్యసభ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.